banner

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ నగర్‌లో బిల్డింగ్ పైనుంచి దూకి యువకుడి బలవన్మరణం

Written by

ఓ యువకుడు ఆస్పత్రి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎల్బీనగర్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ లో ఈరోజు చోటుచేసుకుంది. నగరానికి చెందిన గుమ్మడి రితీష్ రెడ్డి ఇటీవలే ఓ యాక్సిడెంట్ చేశాడు. అయితే, ఆ వ్యక్తి మృతి చెందడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. వెంటనే కారును ఎన్టీఆర్ నగర్‌లోని శ్రీఆద్య ఆసుపత్రి ముందు పార్క్ చేశాడు. అనంతరం భవనం పైకప్పు పైకి వెళ్లి అక్కడి నుంచి దూకి రితీష్‌రెడ్డి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆసుపత్రి యాజమాన్యం సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. అయితే, మృతుడు రితీష్‌కు నెల రోజుల క్రితమే వివాహమైనట్లు తెలుస్తోంది.

Article Categories:
వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *