banner

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు భారీగా తరలివస్తున్న ఎన్టీఆర్ అభిమానులు..

Written by

ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల తరుణం సమీపిస్తుండటంతో అధికార పార్టీ నేతలు, ప్రతిపక్ష నేతలు ఇద్దరూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సైతం ప్రచారాల్లో బిజీగా ఉన్నాడు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఆయన.. నేడు గుడివాడలో పర్యటిస్తున్నారు. గుడివాడలో టీటీపీ అభ్యర్థి వెనిగళ్ల రాము తరపున ప్రచారం చేస్తున్న పవన్ కల్యాణ్.. మీటింగ్ మధ్యలో ఎన్టీఆర్ అభిమానుల గురించి కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘కొడాలి నాని నోరు పారేసుకునే వ్యక్తి. ఆయన నోరు కట్టడి చేయాలంటే రాముని గెలిపించాలి. వైసీపీ ప్రభుత్వం దాడులు, దోపిడీ ప్రభుత్వం. ఎన్టీఆర్, ఎంజీఆర్ మాదిరిగా రాజకీయాల్లో అందరికీ సాధ్యం కాదని.. జనసేనను కాపాడటానికి కాదు ఏపీ బాగు కోసం వచ్చాను’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక పవన్ కల్యాణ్ స్వీచ్ ఇస్తున్న సమయంలో.. జనంలో కొంత మంది ఎన్టీఆర్ ఫ్లకార్డ్స్ పైకి ఎత్తి చూపించారు. దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్.. ‘నాకు ఎన్టీఆర్ ఫ్లాకార్డ్స్ కనిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు, అందరి హీరోల అభిమానులకు నా ధన్యవాదాలు’ అని తెలిపారు.

Article Categories:
సినిమా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *