banner

ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పోరాటం ముగిసింది

Written by

2024 ఐపీఎల్ సీజన్ ఐదు సార్లు ఛాంపియన్ అయిన ముంబై జట్టుకు షాక్ ఇచ్చింది. ఈ సీజన్ లో కొత్త కెప్టెన్ తో వచ్చిన ముంబై జట్టుకు వరుస పరాజయాలతో సతమతమైంది. ఈ సీజన్ లో ఇప్పటివరకు 11 మ్యాచులు ఆడిన ముంబై కేవలం 3 విజయాలను మాత్రమే అందుకుని పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉంది. ముఖ్యంగా 8 అపజయాలతో ఉన్న ముంబై శుక్రవారం కలకత్తా తో తప్పక గెలవాల్సిన మ్యాచులోను ఓడిపోయింది. దీంతో ఐపీఎల్ 2024 సీజన్ ప్లే ఆఫ్ రేసు నుంచి ముంబై జట్టు అధికారికంగా తప్పుకుంది. దీంతో ఐదు సీజన్లలో ఐపీఎల్ కప్పును గెలుచుకున్న ముంబై కనీసం ప్లే ఆఫ్ కు అర్హత సాధించకుండా వెనుదిరగడం ఇది నాలుగోసారి. ఇదిలా ఉంటే ముంబై బాటలోనే ఆర్సీబీ, గుజరాత్ పంజాబ్ జట్టు ఉన్నాయి. ఈ జట్లు ఒక్క మ్యాచ్ లో ఓడిపోయిన ప్లే ఆఫ్ రేసు నుంచి అధికారికంగా తప్పుకొనున్నాయి. అలాగే ఢిల్లీ, చెన్నై జట్లకు ప్లే ఆఫ్స్ ఆశలు ఉన్నప్పటికి టేబుల్ టాప్ 4 లో ఉన్న జట్లు గెలుపోటములపై ఆధారపడి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. మరీ ఈ సీజన్ లో ఏ ఏ జట్టు ప్లే ఆఫ్స్ రేసులో ఉంటాయో తెలియాలంటే మరో 10 రోజులు వేచి చూడాల్సిందే.

Article Categories:
క్రీడలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *