banner

కండక్టర్‌పై దాడి చేసిన కేసులో రెండేళ్ల జైలు శిక్ష. ట్విట్టర్‌లో సజ్జనార్ హెచ్చరిక

Written by

ఆర్టీసీ కండక్టర్‌పై దాడి చేసిన కేసులో ఇద్దరికి రెండేళ్ల జైలు శిక్ష పడిన నేపథ్యంలో ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్నార్ ట్విట్టర్‌లో హెచ్చరిక జారీ చేశారు. బహిరంగంగా విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులపై దాడులు చేస్తే టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం సహించదు. ఉద్యోగుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా దాడులకు, దౌర్జన్యాలకు దిగితే, బాధ్యులపై ఇలా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటుంది. గద్వాల డిపోనకు చెందిన కండక్టర్‌పై దాడి కేసులో ఇద్దరికి రెండేళ్ల జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకున్న పోలీస్, ఆర్టీసీ అధికారులకు TSRTC యాజమాన్యం అభినందనలు తెలిపింది. ” అని ట్వీట్ చేశారు.

Article Categories:
వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *