banner

తెలంగాణలో మూడు రోజులపాటు రాహుల్, ప్రియాంక పర్యటన: ఎప్పట్నుంచంటే?

Written by

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ మూడు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వస్తున్నారు. మూడు రోజులపాటు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

అక్టోబర్ 18, 19, 20 తేదీల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పర్యటించారు. ఈ విషయాలను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే తెలిపారు. ములుగు నుంచి కాంగ్రెస్ బస్సు యాత్ర ఉంటుందని, పెద్దపల్లిలో భారీ బహిరంగ సభ జరగనుందని చెప్పారు.

Article Categories:
వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *