banner

రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ స్వాధీనం. నలుగురు డ్రగ్స్ డీలర్లను అరెస్ట్ చేశారు

Written by

నగరంలో డ్రగ్స్, గంజాయిని పూర్తిగా నిర్మూలించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. దీంతో నగరంలోని జంక్షన్లు, చెక్‌పోస్టులు, పబ్‌లు, క్లబ్‌లలో విస్తృత తనిఖీలు నిర్వహించనున్నారు. నిత్యం ఎక్కడో ఒకచోట పోలీసులు డ్రగ్స్, గంజాయిని పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ డ్రగ్స్ తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్బీ ఎస్‌వో‌టీ, పోలీసులు చేపట్టిన జాయింట్ ఆపరేషన్‌లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టైంది. నగరంలో వివిధ ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన ముఠా, కస్టమర్లపై పోలీసులు దాడులు చేశారు. ఈ మేరకు వారి నుంచి 1.5 కేజీల ఓపీఎం, 24 గ్రాముల హెరాయిన్, 5 కేజీల మేర పోపీస్ట్రా డ్రగ్స్ పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా నలుగురు డ్రగ్స్ వ్యాపారులు, ముగ్గురు కస్టమర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Article Categories:
వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *