banner

తెలంగాణ మంత్రులకు కొత్త ల్యాండ్ క్రూజర్ కార్లు

Written by

తెలంగాణ ప్రభుత్వం మంత్రులకు కొత్త వాహనాలను సమకూర్చింది. గత బీఆర్ఎస్‌ ప్రభుత్వం హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ కాన్వాయ్ కోసం 22 టయోటా ల్యాండ్ క్రూయిజర్ వాహనాలను కొనుగోలు చేశారు. అయితే, తెలంగాణలో అనూహ్యంగా బీఆర్ఎస్ ఓడిపోవడంతో ఆ కొత్త వాహనాలు అలాగే ఉండిపోయాయి. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పాత కాన్వాయ్‌నే ఉపయోగిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కొనుగోలు చేసిన ల్యాండ్ క్రూయిజర్ కార్లకు కాంగ్రెస్ ప్రభుత్వం భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దించింది. అనంతరం ఆ వాహనాలను మంత్రులకు కేటాయించింది. మంత్రులకు ల్యాండ్ క్రూయిజర్ వాహనాల కేటాయింపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఓ పక్కా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని చెబుతోన్న కాంగ్రెస్ సర్కార్.. మంత్రులకు రిచ్‌గా ల్యాండ్ క్రూయిజర్ కార్లు ఇవ్వడం అవసరమా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Article Categories:
రాజకీయాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *