banner

ముగిసిన భువనగిరి MP సెగ్మెంట్ ముఖ్యనేతల సమావేశం..

Written by

భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్ ముఖ్యనేతల సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం రేవంత్ రెడ్డి నేతలకు దిశ నిర్దేశం చేశారు. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు ప్రతి ఒక్కరు గ్రౌండ్‌లో ఉండాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. టికెట్ ఆశించి అసంతృప్తితో ఉన్న నేతలు సమన్వయoతో ముందుకు సాగాలని సూచించారు. త్వరలోనే అందరికీ తగిన గుర్తింపు, న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. 17 నియోజకవర్గాల్లో నామినేషన్ కార్యక్రమానికి సీఎం పాల్గొననున్నారు. నామినేషన్ వేసిన రోజు అదే నియోజకవర్గంలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21న భువనగిరిలో జరిగే నామినేషన్‌కు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. మే మొదటి వారంలో భువనగిరి పార్లమెంట్‌లో భారీ బహిరంగసభలో ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు.

Article Categories:
వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *