banner

భారత యువ షట్లర్ కజకిస్థాన్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ ప్రీక్వార్టర్స్ లోకి చేరింది

Written by

జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్ అన్మోల్ ఖర్బ్ కజకిస్థాన్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ లో దూసుకుపోతుంది. కజకిస్థాన్ ఇంటర్నేషనల్ ఛాలెంజ్ లో మహిళల సింగిల్స్ లో ప్రీక్వార్టర్స్ లోకి ఎంటరయ్యింది ఈ భారత యువ షెట్లర్ . భారత్ కు చెందిన మరో యువ షెట్లర్ మాళవిక బన్సోద్ పై పోరాడి ప్రీక్వార్టర్స్ కు చేరింది. అన్మోల్ 21-13, 22-20 తేడాతో మాళవికను ఓడించింది. దాదాపు గంటపు హోరాహోరీగా మ్యాచ్ సాగింది. ప్రీక్వార్టర్స్ లో అన్మోల్ ఇండోనేషియాకు సేచెందిన నురాని రతు అజహ్రాతో తలపడనుంది. తొలి క్వాలిఫికేషన్ రౌండ్లలో మలేషియాకు చెందిన కాస్సీ రిన్ రోంపోగ్ ను 21-19, 21-9 తేడాతో ఓడించి మెయిన్‌డ్రాలో చోటు దక్కించుకుంది. రెండో రౌండ్ లో కజకిస్థాన్ కు చెందిన కిలా స్మాగులోవా వాకోవర్ చేయగా.. సునాయాసనంగా మరో రౌండ్ కు చేరింది అన్మోల్. మహిళల సింగిల్స్‌ ప్రీ-క్వార్టర్‌ఫైనల్స్‌లోఅనుపమ ఉపాధ్యాయ 21-13, 21-13తో క్వాలిఫయర్ హర్షిత రౌత్ ను ఓడించింది. తాన్యా హేమంత్ 21-19, 21-10తో క్వాలిఫయర్ ఇషానీ తివారీపై విజయం సాధించింది. కెయురా మోపాటి 21-18, 21-13తో మెక్సికోకు చెందిన వెనెస్సా మారిసెలా గార్సియాపై గెలుపొందింది. పోలాండ్ కు చెందిన విక్టోరియా వాకోవర్ చేయగా.. క్వాలిఫయర్ అనెరి కోటక్ తదుపరి రౌండ్‌లోకి దూసుకెళ్లింది.

Article Categories:
వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *