banner

టీ20 వరల్డ్ కప్ అంబాసిడర్‌గా యువరాజ్ సింగ్

Written by

త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. జూన్ 1 నుంచి టోర్నీ మొదలుకానుంది. భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరుదైన గౌరవం దక్కింది. ఈ పొట్టి ప్రపంచకప్‌కు అంబాసిడర్‌గా ఎంపికయ్యాడు. విండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్, 8సార్లు ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ ఉసేన్ బౌల్ట్‌ కూడా అంబాసిడర్లుగా వ్యవహరించనున్నారు.
అంబాసిడర్‌గా యువరాజ్ ప్రపంచకప్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటాడు. ‘ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టడంతోసహా టీ20 వరల్డ్ కప్‌తో నాకు కొన్ని మంచి జ్ఞాపకాలు. ఈ ఎడిషన్‌లో నేను భాగం కావడం ఉత్సాహంగా ఉంది. క్రికెట్‌ ఆడటానికి వెస్టిండీస్ గొప్ప ప్రాంతం. అమెరికాలోనూ క్రికెట్ విస్తరిస్తోంది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఈ ఏడాదిలోనే అతి పెద్ద క్రీడా పోటీగా నిలువనుంది. కొత్త స్టేడియంలో ఉత్తమ ఆటగాళ్లు ఆడటాన్ని చూడటం మరో విశేషం.’ అని యువరాజ్ సింగ్ అన్నారు.

Article Categories:
క్రీడలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *