banner

బురఖాలో వచ్చి నగల దుకాణంలో చోరీ… 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు

Written by

ఇటీవల మేడ్చల్లో పట్టపగలే నగల దుకాణంలో యజమానిని కత్తితో పొడిచి దోపిడీకి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా హల్‌చల్‌ అయింది. ఈ కేసును మేడ్చల్ పోలీసులు 24 గంటల్లో చేధించారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. అయితే, నిందితులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. వారిని పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, మేడ్చల్ పట్టణంలో గురువారం మధ్యాహ్నం ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వచ్చి.. ఒక వ్యక్తి బురఖా వేసుకోని.. మరోవ్యక్తి హెల్మెట్‌ పెట్టుకుని నగల దుకాణంలోకి చొరబడ్డారు. బురఖా వేసుకున్న వ్యక్తి కత్తితో బెదిరిస్తూ యజమాని శేషారాంను బంగారం, వెండి నగలు ఇవ్వాలని హెచ్చరించాడు. ఈ క్రమంలోనే యజమాని హతాశుడై చూస్తుండగానే కుడివైపు ఛాతిపై పొడిచాడు. హెల్మెట్‌ పెట్టుకున్న వ్యక్తి కౌంటర్‌ లోపల ప్రదర్శనకు ఉంచిన నగలను బ్యాగులో వేసే ప్రయత్నం చేస్తుండగా, శేషారాం వారిని తప్పించుకొని బయటికొచ్చి చోర్‌ చోర్‌ అంటూ బయటకు వచ్చి అరిచాడు. దీంతో దొంగలు భయపడి బైక్‌ స్టార్ట్‌ చేసుకొని పారిపోయిన విషయం తెలిసిందే.

Article Categories:
వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *