
జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఇలా రాసుకొచ్చారు. పదేళ్ల క్రితం, డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలో లక్షలాది మంది ఆకాంక్షలను తీర్చిదిద్దుతూ.. భారతదేశంలోనే 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి నా నివాళులు. అందరికీ న్యాయం, సమానత్వం, సాధికారత – ప్రజా తెలంగాణ దార్శనికతకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది అని రాహుల్ గాంధీ తెలిపారు.
Article Categories:
రాష్ట్ర వార్తలు
